సర్వమత ప్రార్థనలతోశ్రీ వైఎస్ జగన్ నూతన గృహ ప్రవేశం

సర్వమత ప్రార్థనలతోశ్రీ వైఎస్ జగన్ నూతన గృహ ప్రవేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనలు జరుగుతుండా సతీమణి శ్రీమతి భారతితో కలిసి ఆయన గృహ ప్రవేశం చేశారు. అనంతరం అదే ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శ్రీ వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులు శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, శ్రీ అనిల్ పాల్గొన్నారు.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024