తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది.
తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేను పలు అంశాలపై ప్రసంగించాను. వాటిపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను. పెనువేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ కారణంగా విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ విధంగా తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలనే అనే అంశంతోపాటు తమ ఆలోచనలు, అభిరుచులకు తగినట్లుగా కెరీర్ను ఎలా ప్లాన్ చేసుకోవాలన్న విషయాలపై నా సూచనలు, సలహాలను వారితో పంచుకున్నాను.