విశాఖలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు…

విశాఖలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో  ముఖ్యాంశాలు...

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని నిర్ణయించాం.

– తెలుగు భాషా ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

– గత ఐదేళ్లూ బాబు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవ వేడుకలు మరిచిపోయారు.

– బెంజ్ సర్కిల్ లో దీక్షలు చేసిన ప్రజలను ఇబ్బంది పెట్టడమే బాబుకు తెలుసు.

– ఇరిగేషన్ విభాగంలో చంద్రబాబు రూ.68 వేల కోట్లు దుర్వినియోగం చేశారు.

– రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారు.

– విశాఖలో భాగస్వామ్య సదస్సు లపై కామర్స్ శాఖకు లేఖరాస్తే వివరాలు లేవన్నారు.

– సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో విశాఖకు మహర్దశ పట్టనుంది.

– విశాఖ కేంద్రంగా అపారమైన అభివృద్ధి జరగనుంది.

– టీడీపీ హయాంలో విశాఖను భూ కుంభకోణాలకు నిలయంగా మార్చారు.

– విశాఖలో భూములపై సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోంది.

– భూ కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవు.

– గత ప్రభుత్వం సిట్ నివేదికను బయటపెట్టలేదు.

– సిట్ విచారణ పరిధిని పెంచే ఆలోచన ఉంది.

– అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాలను సిట్ పరిధిలోకి తేవాలని కోరతాం.

– సిట్ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంచాలని కోరతాం.

– గతంలో రాజధాని విషయంపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది.

– ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక బట్టి నిర్ణయం.

– చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్…. ఇది అందరికీ తెలుసు.

– రాజకీయాల్లో సినిమా స్టిల్స్ పనికిరావు.

– ప్రజా సమస్యలు తీరుస్తారని జనం నమ్మితే పవన్ ఎందుకు ఓడిపోయారు.

– లోకేష్ దీక్ష వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

– ఐదేళ్లూ ఆహార దీక్ష…. ఐదు గంటలు నిరాహార దీక్షా?

– జర్నలిస్ట్ లు అంటే సీఎంకు గౌరవం ఉంది.

– మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే చర్యలు ఉండవు.

– కులాల వారీగా మీడియాను విభజించడం బాధాకరం.

– విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ , డివిజన్ రెండూ ఉండేలా ప్రధాని మోడీ సీఎం శ్రీ వైయస్ జగన్ కు హామీ ఇచ్చారు.

– అన్ని ప్రాంతాల అభివృద్దే సీఎం శ్రీ వైయస్ జగన్ ధ్యేయం.

– పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పనులు జరగాలి.

– లేదంటే భూములు వెనక్కి తీసుకుంటాం.

– లులూ సంస్థ నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టే రద్దు చేశాం.

– ప్రత్యేక హోదా విషయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ వైఖరి మారలేదు.

– పోలవరంపై హైకోర్టు తీర్పు సంతోషం…. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేస్తాం.


Recommended Posts