ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు.

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ది హనుమాన్‌ ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అవధూత, దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిశారు.