నెల్లూరు సిటీ, 5వ డివిజన్ లోని అహ్మద్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి..

నెల్లూరు సిటీ, 5వ డివిజన్ లోని అహ్మద్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీ ఓబులి రవిచంద్ర, పార్టీ స్థానిక నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న 5 ఏళ్లలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ది అందిస్తారని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో నా కుటుంబసభ్యులకు తోడుగా నిలిచిన స్థానిక కార్పొరేటర్ శ్రీ ఓబులి రవిచంద్ర, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024